
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, జాయింట్సెక్రటరీలు రాకేశ్, రాజు, కల్యాణి, శ్రీరాం, నేషనల్ ఎగ్జిక్యూటివ్మెంబర్జీవన్మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. గత బడ్జెట్లో 7 శాతం నిధులు కేటాయించి, పూర్తిగా కూడా ఖర్చు చేయలేదన్నారు. ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు.