
మెదక్ టౌన్/నర్సాపూర్, వెలుగు : విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నా బీఆర్ఎస్ సర్కారును వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతామని ఏబీవీపీ నాయకులు అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్, నర్సాపూర్ పట్టణాల్లో మానవహారం, ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, నర్సాపూర్లో ఏబీవీపీ నగర కార్యదర్శి అక్షయ్ గౌడ్ మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యార్థుల జీవితాన్ని గాలికి వదిలేసి, నిరుద్యోగుల జీవితాన్ని రోడ్డుపాలు చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో 11 శాతం నిధులు ఇచ్చి, ప్రస్తుతం కేవలం ఆరు శాతం నిధులు కేటాయించి ప్రభుత్వం స్టూడెంట్స్కు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రూ.5300 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, విద్యారంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.