
- ట్రాన్స్ఫార్మర్ అప్రూవల్కు రూ.50 వేలు లంచం డిమాండ్
గచ్చిబౌలి, వెలుగు: కొత్త ట్రాన్స్ఫార్మర్అప్రూవల్ఇచ్చేందుకు గచ్చిబౌలి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ) రూ.50 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల పక్రారం.. సైబర్సిటీ సర్కిల్గచ్చిబౌలి సబ్డివిజన్ టీజీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్లో కొట్టె సతీశ్(43) అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
ఈ డివిజన్పరిధిలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్కు ట్రాన్స్ఫార్మర్తోపాటు ఆపరేటెడ్మీటర్ అప్రూవ్చేయాలని యజమాని అప్లికేషన్పెట్టుకున్నాడు. ఏఈ అప్రూవ్ చేసి ఫైల్ను ఏడీఈ సతీశ్వద్దకు పంపాడు. అయితే ట్రాన్స్ఫార్మర్అప్రూవ్చేయాలంటే రూ.75 వేలు లంచం డిమాండ్చేశాడు. దీంతో ఓనర్ ముందుగా రూ.25 వేలు ఇచ్చాడు.
మిగిలిన రూ.50 వేలు కూడా ఇవ్వాలని సతీశ్డిమాండ్చేయగా అపార్ట్మెంట్ఓనర్ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం ఏడీఈ సతీశ్ అపార్ట్మెంట్ఓనర్నుంచి రూ.50 వేలు లంచం తీసుకోగా, అదే సమయంలో ఏసీబీ ఆఫీసర్లు రైడ్చేసి రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, ఏడీఈ సతీశ్నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.