
- రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
గచ్చిబౌలి, వెలుగు: బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఏసీబీకి చిక్కాడు. చార్మినార్ జోన్పరిధిలో మొక్కలు నాటించిన కాంట్రాక్టర్కు రూ.44 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న విప్పెర్ల శ్రీనివాస్ చార్మినార్జోన్ కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. సదరు కాంట్రాక్టర్బిల్లుల క్లియరెన్స్ కోసం శ్రీనివాస్ ను సంప్రదించాడు.
అందుకు శ్రీనివాస్కాంట్రాక్టర్ ని రూ.2.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా కాంట్రాక్టర్నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అడిగినంత ముట్టజెప్పాల్సిందేనని శ్రీనివాస్డిమాండ్చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం కాంట్రాక్టర్నుంచి మిగిలిన రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రైడ్చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ సునంద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి యూబీడీ విభాగంలో తనిఖీలు చేయడంతోపాటు సిబ్బందిని ప్రశ్నించారు. ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్-2 డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో ఈ దాడులు జరిగాయి.