గ్రీన్‌‌కో, ఏస్‌‌ నెక్స్ట్​ జెన్‌‌ సంస్థలకు ఏసీబీ నోటీసులు

గ్రీన్‌‌కో, ఏస్‌‌ నెక్స్ట్​ జెన్‌‌ సంస్థలకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా-ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గ్రీన్‌‌‌‌‌‌‌‌కో, ఏస్ నెక్స్ట్​ జెన్ సంస్థల ప్రతినిధులకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అర్వింద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఏసీబీ విచారించింది.

ఫార్ములా -ఈ రేసుకు మొదట స్పాన్సర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన ఏస్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్​ జెన్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌తో పాటు దాని మాతృ సంస్థ గ్రీన్‌‌‌‌‌‌‌‌కో కార్యాలయాల్లో ఈ నెల 7న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌లో సైబర్‌‌‌‌‌‌‌‌ టవర్స్‌‌‌‌‌‌‌‌లో, మచిలీపట్నంలోని గ్రీన్‌‌‌‌‌‌‌‌కో కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ తెలిసింది.