లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ప్రిన్సిపల్

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ప్రిన్సిపల్

హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‪లో శుక్రవారం ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ రూ.29 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఫుడ్ కాంట్రాక్టుకు సంబంధించి రూ.29వేలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్టు విషయంలో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్కూల్ పై నిఘా పెట్టారు.

ALSO READ | రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయం లేదు రాజీ లేదు: ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి

VM హోమ్ లో ఇంకా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఫుడ్ కాంట్రాక్ట్ లో బిల్లులో ఎక్కువ అమౌంట్ చూపించి.. రూ.29 వేల డబ్బు కాంట్రాక్టర్ నుంచి ప్రభుదాస్ తీసుకుంటున్నాడు. ప్రభుదాస్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.