కలెక్టరేట్‎లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈఈ

కలెక్టరేట్‎లో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఈఈ

జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే గురువారం (అక్టోబర్ 24) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‎లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఈఈ దిలీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. కాగా, రోడ్డు పనుల బిల్లు మంజూరు కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశాడు ఈఈ దిలీప్. 

ALSO READ | వన్ పోలీస్ వన్ రూల్ అమలు చేయండి..

దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు అవినీతి అధికారి భరతం పట్టేందుకు ఏసీబీ పక్కా వ్యూహాం రచించింది. ప్లాన్‎లో భాగంగా ఇవాళ కాంట్రాక్టర్ అధికారికి లంచం ఇస్తుండగా సడన్ ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు.. రూ.20వేల లంచం తీసుకుంటుండగా దిలీప్‎ను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. అనంతరం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ ముమ్మరంగా సోదాలు నిర్వహించింది.