నిజామాబాద్ లో అమృత్​ 2.0 పనుల వేగం పెంచాలె : గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్​అలీ

నిజామాబాద్ లో అమృత్​ 2.0 పనుల వేగం పెంచాలె : గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్​అలీ

​నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ సిటీలో అమృత్​ 2.0 స్కీమ్​ కింద మంజూరైన రూ.400 కోట్ల పనులను వేగవంతం చేయాలని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ సూచించారు. గురువారం కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మౌలిక వసతుల కోసం మంజూరైన ప్రతి పైసాను సద్వినియోగం చేయాలని, ఎండాకాలం తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ప్లాన్​తో పని చేయాలన్నారు.

పెండింగ్ పనులు పూర్తి చేయాలని నగరపాలిక పరిధిలో మాస్టర్​ ప్లాన్​ అమలైతే మరింత డెవలప్​మెంట్​కు ఆస్కారం ఉందన్నారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్​​పాల్​ సూర్యనారాయణ, నుడా చైర్మన్ కేశవేణు, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్, ఆర్అండ్​బీ, పీఆర్​, పబ్లిక్​ హెల్త్​, మిషన్​ భగీరథ శాఖల ఆఫీసర్లు ఉన్నారు. తరువాత ఎమ్మెల్యే  ధన్​పాల్​తో కలిసి 565 మంది లబ్ధిదారులకు రూ.5.65 కోట్ల విలువ గల షాదీముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ  చేశారు. 

ఉద్యోగుల ప్రయోజనాన్ని కాపాడుతాం..

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెలా ఫస్ట్​కే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్​అలీ అన్నారు.  ఉద్యోగుల ప్రతి ప్రయోజనాన్ని కాంగ్రెస్​ సర్కార్ కాపాడుతుందన్నారు. టీఎన్జీవో యూనియన్ డైరీని ఆవిష్కరించి   మాట్లాడారు. గెజిటెడ్​ ఆఫీసర్స్​ బిల్డింగ్​కు ల్యాండ్ కేటాయించామని నిర్మాణ పనులకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

సమావేశంలో గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ స్టేట్​ ప్రెసిడెంట్​ ఏలూరి శ్రీనివాస్​రావు, సెంట్రల్​ యూనియన్​ జనరల్​ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా ప్రెసిడెంట్​ ఆలుక కిషన్, కార్యదర్శి అమృత్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో యూనియన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందుకు ఆయన హాజరయ్యారు.