జినోమ్ వ్యాలీ.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

జినోమ్ వ్యాలీ.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

 మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి జినోమ్ వ్యాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఎదురు రోడ్లకు వెళ్లి అటుగా వస్తున్న బస్సును ఢీకొట్టపోయి బోల్తా కొట్టింది. యాక్సిడెంట్ లో ఇన్నోవా కార్ లో ఉన్న ఇద్దరు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారులో నలుగురు ప్రయాణించగా అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కారు అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.