
ముషీరాబాద్, వెలుగు: డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతో ట్యాంక్బండ్వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన అంబీర్ మధుసూధన్ రావు, శారద (50) దంపతులు.
ఆదివారం (April 29) రాత్రి బైక్పై జేబీఎస్ నుంచి మెహిదీపట్నంలోని తమ కొడుకు వద్దకు బయలుదేరారు. ట్యాంక్ బండ్పైకి రాగానే, వెనుక నుంచి అశోక్ లేలాండ్ వాహనం ఢీకొని కిందపడ్డారు. ఈ ఘటనలో శారదకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షేక్ అష్రఫ్ అదుపులోకి తీసుకొని, పోలీసులు విచారిస్తున్నారు
లారీని బైక్ ఢీకొని మరొకరు..
జీడిమెట్ల: లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ బండమాదారానికి చెందిన జె.అనిల్ (27) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున దూలపల్లి నుంచి ఇంటికి బైక్పై వస్తుండగా, మార్గమధ్యలో యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.