
- క్రాప్ లోన్ కట్టలేదని అకౌంట్లు బ్లాక్ చేశారు
- బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగిన రైతులు
శివ్వంపేట, వెలుగు: క్రాప్ లోన్ కట్టలేదనే కారణంతో తమ అకౌంట్లు బ్లాక్ చేశారని పేర్కొంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి ఆంధ్రా బ్యాంకు ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేశారు. క్రాప్ లోన్ కట్టలేదని తమ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా అకౌంట్ హోల్డ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
రుణమాఫీ కాగానే క్రాప్ లోన్ క్లియర్ చేస్తామని చెప్పినా బ్యాంకు ఆఫీసర్లు వినడం లేదని వాపోయారు. క్రాప్ లోన్ కడితేనే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చని చెబుతున్నారన్నారు. 30 మంది అకౌంట్లు హోల్డ్లో పెట్టారని, క్రాప్ లోన్ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే క్రాప్ లోన్ మాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరారు.