
ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏసర్ రెండు కొత్త టాబ్లెట్స్ వన్ 8, వన్ 10లను లాంచ్ చేసింది. రెండింట్లోనూ మీడియాటెక్ 8768 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. వన్8లో 8.7-అంగుళాల స్క్రీన్ఉంటుంది. వన్ 10లో మాత్రం 10.1-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. రెండూ అండ్రాయిడ్12 ఓఎస్తో నడుస్తాయి. వన్8లో 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజీ ఉంటాయి. వన్10లో 4జీబీ+64 జీబీ స్టోరేజీ ఉంటాయి. 4జీ సిమ్, వైఫై, బ్లూటూత్ 5.0, కెమెరాల వంటి ప్రత్యేకతలు వీటి సొంతం. వన్8 ధర రూ.12,990 కాగా, వన్10 రేటు రూ. 17,990.