
అచ్చంపేట, వెలుగు : వేసవికాలం గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూడాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శాంతాబాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యలను ఆయన తెలుసుకున్నారు. పెండింగ్లో అభివృద్ధి పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టు రద్దు హెచ్చరించారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంత్ర్య నాయక్ ,వైస్ ఎంపీపీ అమరావతి తదితరులు పాల్గొన్నారు.