
- 180 మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ సెలక్షన్స్
- సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందజేత
రామచంద్రాపురం,వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో శుక్రవారం అచీవర్స్డే ఘనంగా నిర్వహించారు. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మా, హ్యుమనిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ స్టూడెంట్స్కు నియామక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందించారు.
2023,--24 విద్యా సంవత్సరంలో దాదాపు 180 దేశీయ, బహుళ జాతి కంపెనీలు గీతంలో క్యాంపస్సెలక్షన్స్నిర్వహించగా 150 కంపెనీలు బీటెక్, ఎంటెక్, బిబీఏ, బీకాం, ఎంబీఏ, బి.ఫార్మా, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ స్టూడెంట్స్ను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. కొంతమంది స్టూడెంట్స్ఉన్నత విద్యాభ్యాసం కోసం అప్లై చేసుకుని విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశార్హత సాధించినట్టు తెలిపారు.
ఎక్కువ మంది స్టూడెంట్స్ఐటీ సేవలతో పాటు బహుళజాతి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో జాబ్స్పొందినట్టు చెప్పారు. టెక్నాలజీ స్టూడెంట్స్కు రూ.15 లక్షల గరిష్ట వార్షిక వేతనం, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కు రూ.14.13 లక్షలు, సెర్చ్ స్టూడెంట్స్కు రూ.7.5 లక్షల చొప్పున వార్షిక వేతనాలకు ఎంపి కెనట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీవివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.