కుకునూరుపల్లి లో అల్యూమినియం వైర్ల దొంగలు అరెస్ట్​

కుకునూరుపల్లి లో అల్యూమినియం వైర్ల దొంగలు అరెస్ట్​

కొండపాక (కుకునూరు పల్లి )వెలుగు: కొత్తగా నిర్మించే వెంచర్లను టార్గెట్ చేసి అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న దొంగలను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ బాలాజీ తెలిపారు. మంగళవారం కుకునూరుపల్లి పీఎస్​లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన గంగులోతు చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, జలంధర్ ఒక ముఠాగా ఏర్పడి కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లలో అల్యూమినియం​వైర్లను చోరీ చేస్తున్నారు.

 వీటిని ప్రజ్ఞాపూర్, సిద్దిపేటలోని పలు స్క్రాప్ దుకాణాలలో అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వెలికట్ట చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. విచారించగా చోరీలు చేసింది తామేనని ఒప్పుకున్నారని చెప్పారు.