నందిపేటలో ఫ్లాగ్​మార్చ్

నందిపేటలో ఫ్లాగ్​మార్చ్

నందిపేట, వెలుగు: రాబోయే ఎన్నికలు, పండుగల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభధ్రతలు కాపాడేందుకు ప్రజలు సహకరించాలని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి కోరారు. గురువారం నందిపేటలో వివేకానందా చౌరస్తా నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్​ వరకు ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్​తో కలిసి ఫ్లాగ్ మార్చ్​​నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు, శాంతిభధ్రతలు, గతంలో జరిగిన కమ్యూనల్​ గొడవలను దృష్టిలో ఉంచుకొని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఏఎఫ్​ బలగాలతో మాక్​ డ్రిల్​ నిర్వహించినట్లు తెలిపారు. ఆర్ఏఎఫ్​ 99 బెటాలియన్​ డిప్యూటీ కమాండెంట్​వీరేంద్ర యాదవ్, నందిపేట ఎస్సై చిరంజీవి, గ్రామస్తులు పాల్గొన్నారు.