ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి .. రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.జ్ఞానేశ్వర్‌

ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి .. రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.జ్ఞానేశ్వర్‌

గండిపేట, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్‌ కుమార్​పై అనుచిత వాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, గండిపేట మండల అధ్యక్షుడు అశోక్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మంచిరేవుల చౌరస్తాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద జగదీశ్​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 

స్పీకర్​ను ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్​కాదన్నారు. బీఆర్ఎస్​ఇచ్చిన హామీ ప్రకారం దళితుడిని సీఎం చేయకపోగా, చాన్స్​దొరికినప్పుడల్లా దళితులను కించపపరుస్తోందని మండిపడ్డారు.