
హైదరాబాద్లో సినీ నటుడు మోహన్బాబు జర్నలిస్టులపై దాడి చేయడంపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేయడం అప్రజాస్వామికమని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. - వెలుగు, నెట్వర్క్