మనిషిని మర్డర్ చేసి.. పబ్ లో పార్టీ చేసుకున్న హీరో దర్శన్

మనిషిని మర్డర్ చేసి.. పబ్ లో పార్టీ చేసుకున్న హీరో దర్శన్

కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణు కుమార్ ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో దర్శన్ తో పాటు అతని ఫ్రెండ్ పవిత్ర గౌడ కూడా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తాజాగా ఈ కేసు విషయంలో మరో షాకింగ్ అంశం బయటపడింది. రేణుకుమార్ ను హత్య చేసిన తర్వాత దర్శన్ పబ్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారన్న వార్త షాక్ కి గురి చేస్తోంది. హత్య చేసే ముందు రేణుకుమార్ ను కిడ్నాప్ టార్చర్ పెట్టి చంపేసిన దర్శన్ ఆ తర్వాత బెంగళూరులోని ఓ పబ్ కి వెళ్లి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

హత్య తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి రిలయన్స్ ట్రెండ్స్ కి వెళ్లి కొత్త బట్టలు కొని, రక్తంతో తడిసిన బట్టలు చేంజ్ చేసుకొని పబ్ వెళ్లారని తెలుస్తోంది.పోలీసులు సోమవారం నిందితులను తీసుకెళ్లి సీన్ రిక్రియెట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 19మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.