Prudhvi Raj: గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్కు నేషనల్ అవార్డు గ్యారంటీ: పృధ్వీ రాజ్

Prudhvi Raj: గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్కు నేషనల్ అవార్డు గ్యారంటీ: పృధ్వీ రాజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం.. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడమే. అందుకే.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి, రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు టాలీవుడ్ నటుడు పృధ్వీ రాజ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా యాంకర్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి అడిగారు దానికి సమాధానంగా పృధ్వీ రాజ్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా ఒక అద్భుతం. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను శంకర్ గారు భారీగా తెరకెక్కిస్తున్నారు. 

ఇక సినిమాలో రామ్ చరణ్ నటన గురించి  ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ. గేమ్ ఛేంజర్ సినిమా రామ్ చరణ్ కి, శంకర్ కి, దిల్ రాజుకి, మాలాంటి నటులోకి మంచి పేరు తెచ్చిపెడుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు పృధ్వీ రాజ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. శ్రీకాంత్,  ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర, అంజలి, సునీల్, తదితరులుకీ రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్  సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.