![Rao Ramesh rao: ఉండి నియోజకవర్గానికి నటుడు రావు రమేష్ మూడు లక్షల విరాళం](https://static.v6velugu.com/uploads/2024/06/actor-rao-ramesh-donates-three-lakhs-to-undi-constituency_3MVPz7uEBL.jpg)
ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గ అభివృద్ధి పనులకు రూ.3 లక్షలు విరాళంగా అందించారు నటుడు రావు రమేష్ రావు. ఈ మేరకు రూ.3 లక్షల చెక్కును ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకి అందించారు. అక్కడ డ్రైనేజీ, నియోజకవర్గ అభివృద్ధి పనులకు కోసం తన వంతు సాయంగా అందించినట్టుగా రావు రమేష్ తెలిపారు. ఈ సంధర్బంగా ఆయనకి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన "Drainage Maintenance Infrastructure Fund, UNDI" నిధికి రూ. 3,00,000 లు విరాళం అందించిన ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. pic.twitter.com/wwUPIHc29T
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) June 29, 2024
ఈ విషయాన్ని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన Drainage Maintenance Infrastructure Fund, UNDI నిధికి ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ రూ. 3,00,000 లు విరాళం అందింజేశారు. ఆయనకీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అని రాసుకొచ్చారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.