పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

అత్తారింటికి దారేది' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash). తాజాగా ప్రణీతా సుభాష్ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ప్రణీతకు కూతురు ఉండగా..ఇవాళ సెప్టెంబర్ 5న పండంటి మగబిడ్డకు తల్లి అయ్యారు.ఈ మేరకు ప్రణీత స్పందిస్తూ..“మా కుంటుంబం అంత థ్రిల్‌గా ఉన్నాము. నా కుమార్తె అర్నా..బాబుని 'బేబీ' అని పిలుస్తుంది, కానీ తన సోదరుడని..పాప ఇంకా గ్రహించలేదని అనుకుంటున్నాను" అని ప్రణిత తెలిపింది.

కాగా ప్రణీత 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లోను నటించింది. కాగా ఇటీవల కాలంలో తెలుగు ఢీ డ్యాన్స్ షోలో కూడా కొన్ని ఎపిసోడ్‌లకి ప్రణీత జడ్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా ప్రణీత ప్లేస్‌లోకి బ్యూటీ హన్సిక ఎంట్రీ ఇవ్వగా అందరు షాక్ అయ్యారు. ఇక ప్రణీత లేటెస్ట్ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసింది.

Also Read :- ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్

 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. 'రభస', 'డైనమైట్' సహా పలు చిత్రాల్లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ సరసన 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించి 'బాపు బొమ్మ'గా పాపులర్‌ అయ్యింది.