ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను..ముగిసిన నటి శ్యామల విచారణ

ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను..ముగిసిన నటి శ్యామల విచారణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో  పంజాగుట్ట పీఎస్ లో  నటి శ్యామల విచారణ ముగిసింది. మార్చి 24న ఉదయం 9 గంటల నుంచి  దాదాపు మూడున్నర గంటల పాటు శ్యామలను విచారించారు పంజాగుట్ట పోలీసులు. 

విచారణ అనంతరం మాట్లాడిన శ్యామల.. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం తప్పని..నష్టపోయిన వారెవరైనా ఉంటే  ఆలోటు తీర్చలేనిదని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు.చట్టాలపై నమ్మకం ఉందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు నటి శ్యామల.

Also Read : బెట్టింగ్ యాప్ కేసు..విచారణకు హాజరైన శ్యామల

ఈ కేసులో ఇప్పటి వరకుఈ  కేసులో   టేస్టీ తేజ,కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు.  విష్ణుప్రియ, రీతూ చౌదరి మార్చి 25న మరోసారి ఎంక్వైరీకి రానున్నారు. వీరితో పాటు సన్నీ యాదవ్  , అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్​ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం.  ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులిచ్చేందుకు పోలీసులు భావిస్తున్నారు. 

అటు మియాపూర్ పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసులో విజయ్​దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్​రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్​లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.