
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ రూ.36 వేల కోట్ల విలువైన ముంబై మోతీలాల్రీడెవలప్మెంట్ ప్రాజెక్టును గెలుచుకుంది. మొత్తం 143 ఎకరాల్లో ఇది ప్రాజెక్టును నిర్మిస్తుంది. త్వరలోనే లెటర్ ఆఫ్ అలాట్మెంట్ను జారీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ ఇది వరకే ధారావి స్లమ్ రీడెవలప్మెంట్ప్రాజెక్టును దక్కించుకుంది. బొంబాయి హైకోర్టు గత వారం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) కు మోతీలాల్ నగర్ను రీడెవలప్మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
మోతీలాల్ నగర్ను ఆధునిక అపార్ట్మెంట్లుగా తీర్చిదిద్దుతారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏడేళ్లు పడుతుంది. డిజైన్, అప్రూవల్స్, ఇన్ఫ్రా డెవెలప్మెంట్, నిర్మాణం, పునరావాసం వంటి పనులను ప్రత్యేక డెవెలప్మెంట్ఏజెన్సీయే చూస్తుంది. మోతీలాల్ప్రాజెక్టు వల్ల 3,372 మందికి పునరావాసం దొరుకుతుంది.