
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు.. అమెరికా మెడికల్ రీసెర్చ్ సంస్థ మయో క్లినిక్తో కలిసి ముంబై, అహ్మదాబాద్లలో రెండు 1,000 బెడ్ల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను నిర్మించనుంది. ఇందుకోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేయనుంది.
సమాజసేవ కోసం రూ.10 వేల కోట్లు విరాళం ఇస్తామనని గౌతమ్ అదానీ గత వారం తన చిన్న కుమారుడు జీత్ వివాహం చేసుకున్నప్పుడు ప్రకటించారు. ఆస్పత్రులకు నిధులను నిధులను ఆ మొత్తం నుంచే కేటాయిస్తారు. తమ ఆస్పత్రులకు మయో క్లినిక్ సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది.
మనదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన, ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ, వైద్య విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది.