
- కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్డిమాండ్
- 31న గద్దర్ జయంతి నిర్వహస్తున్నాం
ఖైరతాబాద్, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి ఉత్సవాన్నిఈ నెల31న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు. సీనియర్జర్నలిస్ట్ అల్లంనారాయణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికుమార్, ఓయూ నేత మందాల భాస్కర్, కాంగ్రెస్సీనియర్నేత అద్దంకి దయాకర్, సినీ దర్శకుడు శంకర్తో కలిసి సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి ఉత్సవంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా గద్దర్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఆయన కుటుంబానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్చేశారు.
కేంద్ర ప్రభుత్వం తర్వాతైనా గద్దర్కు పద్మా అవార్డు ఇవ్వాలని కోరారు. ‘బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపించిన వ్యక్తి గద్దర్.. ఆయనకు పురస్కారం ఎలా ఇస్తాం.. ఆయనకున్న అర్హత ఏంటి’ అంటూ బండి సంజయ్కామెంట్చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అల్లం నారాయణ, క్రాంతికుమార్ అన్నారు. అనంతరం జయంతి పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో పీఎస్ఎన్ మూర్తి, శ్రీనివాస్పాల్గొన్నారు.