ఎల్ఆర్ఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ అంకిత్​

ఎల్ఆర్ఎస్  సర్వేను త్వరగా పూర్తి చేయాలి : అడిషనల్ కలెక్టర్ అంకిత్​

నవీపేట్, వెలుగు : ఎల్ఆర్ఎస్​కు సంబంధించిన ప్రతీ అప్లికేషన్ పరిశీలించి సర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఆన్ లైన్ లో ఎప్పటికి అప్పుడు నమోదు చేయాలని నిజామాబాద్​ అడిషనల్ కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. 

మండలంలోని జన్నేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్ఆర్ఎస్ సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఎక్కడెక్కడ అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయని ఎంపీడీవో నాగనాథ్ ను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. అడిషనల్​కలెక్టర్​ వెంట డివిజన్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీవో రామకృష్ణ ఉన్నారు.