
నిజామాబాద్, వెలుగు : సమాజానికి పెనుసవాల్గా మారిన మత్తు, మాదకద్రవ్యాల నిరోధానికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్కుమార్ కోరారు. బుధవారం ఆయన తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో మాట్లాడారు. రోడ్, రైలు మార్గాల్లో నిరంతర నిఘా పెట్టి డ్రగ్స్ రవాణాను గుర్తించాలని, లోకల్గా గంజాయి సాగు మూలాలను తెలుసుకోవాలన్నారు. కల్తీ కల్లులో కలుపడానికి ఉపయోగించే అల్ఫాజోలం నిల్వలు పసిగట్టాలన్నారు.
అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్, ట్రాన్స్పోర్టు ఆఫీసర్ ఉమామహేశ్వర్రావు, ఫారెస్ట్, కమర్షియల్ ట్యాక్స్, డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు హాజరయ్యారు. ఎండాకాలంలో ప్రజలకు అందించాల్సిన సేవలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్లో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ మాట్లాడారు. బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లకు రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలని, ఉపాధి కూలీలు వడదెబ్బబారిన పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.