మధ్యాహ్న భోజనం మెనూ పాటించాలి

మధ్యాహ్న భోజనం మెనూ పాటించాలి

కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలోని స్టూడెంట్స్ కు  మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్  అధికారులకు సూచించారు. బుధవారం కూసుమంచి ఉన్నత పాఠశాలను అడిషనల్​ కలెక్టర్ తోపాటు, డీఈవో సోమశేఖర శర్మ, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య  వేర్వేరుగా  సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.

పాఠ్యాంశాలు అర్థం కాకపోతే తిరిగి అడగాలని సూచించారు.  విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. డీఈవో మాట్లాడుతూ స్కూల్​కు టీచర్స్​ను రెండు రోజుల్లో డిప్యూటేషన్ పై పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎం శ్రీనివాస్, స్కూల్​ఇన్ చార్జి హెడ్మాస్టర్​ రేల విక్రమ్ రెడ్డి, ఎంపీఎం సత్యవర్ధన్ రాజు, సీసీలు నవీన్ బాబు, కృష్ణయ్య , శ్రీను, రాంబయమ్మ, వీవో అధ్యక్షురాలు సీత, భారతమ్మ , గ్రామదీపికలు రమాదేవి, రమణ, శిరీష, మల్లిక తదితరులు పాల్గొన్నారు.