స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్​ నగేశ్

స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్​ నగేశ్

మెదక్​ టౌన్​, వెలుగు :  జిల్లాలో సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, అసిస్టెంట్​ రిటర్నింగ్, అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్​పీవోలు, అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

జిల్లాలోని 492  గ్రామపంచాయతీల్లో  190 ఎంపీటీసీ స్థానాలు, 21  జడ్పీటీసీ స్థానాలకు, 21 ఎంపీపీ, 492 సర్పంచ్​, 4,220 వార్డు సభ్యుల స్థానలకు  ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీపీఆర్​వో శ్రీనివాస్​ రావు, డీఎస్​వో రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.