ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​నగేశ్​

ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​నగేశ్​

మెదక్​టౌన్, వెలుగు : ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మెదక్​ కలెక్టరేట్​లో పీవోలు, ఏపీవోలు, సెక్టార్, నోడల్​ అధికారులకు పవర్​ పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్ మాట్లాడుతూ..పోలింగ్​సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల  నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలన్నారు.  జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు-22, టీచర్​ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు-21 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

43 మంది పీవోలు, 43 ఏపీవోలు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.  ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి  పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.  ఈ నెల13వరకు కలెక్టర్ ఆఫీసులో  పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, రాజిరెడ్డి, పీవోలు, ఏపీవోలు, నోడల్​అధికారులు పాల్గొన్నారు.