ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం, వెలుగు:  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి   అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి (గ్రీవెన్స్)  లో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, డీఈఆర్డీవో సన్యాసయ్య  తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అడిషనల్​  కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టరేట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖలు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల నివేదికను మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని సూచించారు.