ఎల్కతుర్తిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం : అడిషనల్​కలెక్టర్​వెంకట్​రెడ్డి

ఎల్కతుర్తిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం : అడిషనల్​కలెక్టర్​వెంకట్​రెడ్డి

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మార్కెట్​యార్డులో మంగళవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​కలెక్టర్​వెంకట్​రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్డీవో నాగపద్మజ, డీఎస్వో ఉమారాణి, తహసీల్దార్ జగత్ సింగ్, ఏవో రాజ్ కుమార్, ఏపీఎం రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి 
తదితరులున్నారు.