కులగణనపై నీతులు చెప్పొద్దు.. కేటీఆర్​ సుద్దపూస మాటలు ఆపాలి.. ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​

కులగణనపై నీతులు చెప్పొద్దు.. కేటీఆర్​ సుద్దపూస మాటలు ఆపాలి.. ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​
  • ఫస్ట్​ మీ పార్టీ బీసీలకు వ్యతిరేకి  
  • కేటీఆర్​పై ఫైర్​

హైదరాబాద్: బీసీల విషయంలో  కేటీఆర్​ నీతులు చెప్పాల్సిన అవసరం  లేదని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. ఇవాళ గాంధీభవన్​లో ఆయన మాట్లాడుతూ.. బీసీ కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.  మా ప్రభుత్వంపై డెడ్​లైన్​ పెట్టేంత సీన్​ కేటీఆర్​కు లేదు.  ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో తీర్మాణం చేసింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి.  అంతే చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ పదేళ్లు ఎందుకు చేయలేదు.

ఫస్ట్​ మీ పార్టీ బీసీలకు వ్యతిరేకి..   బీఆర్ఎస్​ ప్రెసిడెంట్, వర్కింగ్​ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత పదవుల్లో ఒక్కరైనా బీసీ ఉన్నారా..?  మూడు పదవులు అయ్యా.. కొడుకేనా..   చిత్తశుద్ది  ఉంటే  కేటీఆర్​ ఫస్ట్​ బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవికి రాజీనామా చేసి, బీసీ​ ఇచ్చి, మాట్లాడాలి.  ఇప్పటికైనా  కేటీఆర్​సుద్దపూస మాటలు ఆపాలి. బీసీ జనాభా అధికంగా ఉందన్న ఆలోచనతోనే కేసీఆర్​ సమగ్ర సర్వే రిపోర్ట్​ బయటపెట్టలేదు.  కాంగ్రెస్​ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇస్తుంది.

కాంగ్రెస్​ స్వయంగా బీసీకి   పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చింది.  మా ప్రభుత్వం  బీసీలకు చేస్తున్న పనులకు ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు.  పదేళ్ల విధ్వంసకర పాలనను గాడిలో పెడుతున్నాం.  బీఆర్ఎస్​ పాలనలో ఎప్పుడూ నలుగురే  కనిపించేవారు, ఇప్పుడు వాళ్లే మీడియా ముందు కనిపిస్తున్నారు. చివరకు మిగిలేది ఆ నలుగురు మాత్రమే.  గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చాం.  బీఆర్ఎస్​ కేవలం వాళ్లను ఉద్యమంలో వాడుకున్నారని ఆది శ్రీనివాస్​ ఫైర్​ అయ్యారు.