జడ్జిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి  : బార్​ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్

జడ్జిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి  : బార్​ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడికి పాల్పడ్డ ఖైదీని కఠినంగా శిక్షించాలని ఆదిలాబాద్ బార్​ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కేమ శ్రీకాంత్​, మహేందర్ తదతరులు పాల్గొన్నారు.​