
ఆదిలాబాద్టౌన్(జైనథ్), వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఏఐ విద్య బోధన వల్ల స్టూడెంట్ల సామర్థ్యం పెరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. . సోమవారం జైనథ్ మండలం పిప్పర్వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ శిక్షణ ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేశారు. జిల్లాలో 8 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
విద్యాశాఖ, ఏషియా ఫౌండేషన్ వారి సమన్వయంతో దేవాపూర్ 2 ఉర్దూ, తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్, తాటిగూడ, కోడద్, బాలాపూర్, రణదీవ్ నగర్ , పిప్పర్ వాడ, అడ ల్లో ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పిప్పరవాడలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ కార్నర్ ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రణీత, అధికారులు ఉన్నారు.