
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తాంసి మండలం కప్పర్లలో ఓ పశువుల కొట్టం దగ్ధమైంది. పశువుల కొట్టంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాలి బూడిద అయింది. దీని పక్కనే రెండు మాక్సక్ష వాహనాలుండగా వాటికి నిప్పంటుకొని కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు మంటలార్పారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు బాధితులు కోరుతున్నారు.