రిమ్స్​ ముందు ఆక్రమణల తొలగింపు

రిమ్స్​ ముందు ఆక్రమణల తొలగింపు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి మెయిన్ ​గేట్​ముందు వెలిసిన ఆక్రమణలకు బుధవారం పోలీసుల సహకారంతో మున్సిపల్​అధికారులు తొలగించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న షెడ్లను తొలిగించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి పేర్కొన్నారు.

 రోడ్డు ప్రక్కన్న ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రిమ్స్​ డైరెక్టర్ ​జైసింగ్​ రాథోడ్, టూటౌన్​ సీఐ కరుణాకర్​రావు, మున్సిపల్​సానిటరీ ఇన్​స్పెక్టర్​ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.