
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆదివారం గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారన్నారు. కార్పొరేట్ఆస్పత్రులతో పోటీగా ఇక్కడ సర్జరీలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజలు గతంలో మాదిరిగా హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే భారం తప్పిందన్నారు. ప్రజలు ఈ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్అశోక్, డాక్టర్లు,సిబ్బంది పాల్గొన్నారు.