
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : గిరిజన భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాస్ను కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. కైలాస్దంపతులను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
గోండు, కోలాం భాషల అభివృద్ధికి ఏఐ(కృత్రిమ మేధా) ద్వారా కైలాస్చేపడుతున్న కార్యక్రమాలను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో కొనియాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్పై కైలాస్ రాసిన పాటను కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో డీఈశో టి.ప్రణీత, టీచర్లు అజయ్, రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.