
టాలీవుడ్లో మరో ప్రేమజంట ఒక్కటి కాబోతోంది. పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో నాగార్జున మేనకోడలు సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నటనకు గుడ్బై చెప్పిన సుప్రియ నిర్మాతగా రాణిస్తోంది. తన సినిమాలతోనే కాకుండా వరుస రూమర్లతో వార్తల్లో నిలుస్తోంది.
టాలీవుడ్ ట్యాలెంటడ్ హీరో అడవిశేష్తో డేటింగ్లో ఉందంటూ 2019 నుంచే ఆమెపై రూమర్లు వినిపిస్తున్నాయి. అక్కినేని వారి ఇంట జరిగే ఫంక్షన్లలో శేష్ కనిపించడం, ఇద్దరూ కలిసి మీడియా కంట పడటంతో ఆ ఫొటోలు వైరల్గా మారాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
శేష్ ఫ్యామిలీ ఎట్టకేలకు గ్నీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. నాగార్జున దగ్గరుండి ఈ వేడుకను జరిపించనున్నాడట. జూన్ 16న వీరి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నట్టు సమాచారం.