నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా
  • వకాలత్‌ దాఖలు చేసిన మంత్రి సురేఖ తరఫు న్యాయవాది
  • ఈ నెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసిన కోర్టు

హైదరాబాద్, వెలుగు : మంత్రి కొండా సురేఖపై సినీహీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం కేసుపై నాంపల్లిలోని మనోరంజన్ స్పెషల్‌ కోర్టు బుధవారం విచారణ జరిపింది.   సురేఖ తరుఫున  న్యాయవాది గుర్మీత్ సింగ్ వకాలత్​ దాఖలు చేశారు. కొండా సురేఖకు ఈ నెల 10న కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని కొండా సురేఖ కామెంట్​ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు.