మిలిటరీ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో అడ్మిషన్స్​

మిలిటరీ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో అడ్మిషన్స్​

దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-–2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో అడ్మిషన్స్​కు కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ 2025 - 26 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ అయింది. ఈ మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అర్హులైన బాలబాలికలు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలి.

అర్హతలు: 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వయసు 10 నుంచి 12 ఏండ్ల మధ్య ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. వయసు 13 నుంచి 15 ఏండ్ల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​: రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ఓఎమ్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.