
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, యూఎస్ఏలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం సహకారంతో 2022-–23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ(అగ్రి), బీడీఎస్, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష నవంబర్ 4న నిర్వహిస్తారు.