
కేంద్రియ విద్యాలయ సంఘటన్ దేశవ్యాప్తంగా ఉన్న1247 కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఇంటర్మీడియట్ మినహా మిగిలిన అన్ని తరగతుల వారు అడ్మిషన్లకు అప్లై చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం నెలకొల్పిన కేంద్రియ విద్యాలయా(కేవీ)లు నాణ్యమైన విద్యాబోధనకు వేదికలుగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1247 విద్యాలయాలు కొనసాగుతుండగా.. తెలంగాణలో దాదాపు 30 వరకు ఉన్నాయి.
సీట్లు: ఒక్కో కేంద్రియ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. ఒకటో తరగతిలో 40 సీట్లను భర్తీ చేస్తారు. కొన్ని కేవీల్లో సెక్షన్స్ కూడా ఉంటాయి. అలా ఉంటే సెక్షన్కు 40 సీట్లు భర్తీ చేస్తారు.
వయసు: 1వ తరగతికి మార్చి 31 నాటికి 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో ఉండాలి. దివ్యాంగులైన స్టూడెంట్స్కు రెండేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
అడ్మిషన్ ప్రయారిటీస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అటానమస్ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు/పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలకు వరస ప్రకారం అడ్మిషన్ ప్రయారిటీ ఇస్తారు. వీరితోపాటు సింగిల్ గర్ల్ చైల్డ్కు, పార్లమెంట్ మెంబర్స్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన స్టూడెంట్స్కు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది.
ఆర్టీఈతో 10 సీట్లు
జాతీయ విద్యా హక్కు చట్టం 2009 గైడ్లైన్స్ ప్రకారం ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్లైన్లో లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్టీఈ కింద అడ్మిషన్ పొందితే ఎనిమిదో తరగతి వరకు ఉచిత బోధన లభిస్తుంది. ఆర్టీఈ కింద అప్లై చేసే వారు రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. మేజర్ సిటీస్, అర్బన్ ఏరియాస్లో కేవీఎస్ ఉంటే 5 కిలోమీటర్ల రేడియస్ లోపల ఉన్న వారి అప్లికేషన్లే పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా ప్రాంతాలైతే 8 కిలోమీటర్ల రేడియస్లో ఉండాలి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
1వ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చిన అప్లికేషన్లను కేటగిరీల వారీగా లాటరీ తీసి అడ్మిషన్స్ కల్పిస్తారు. మొదట ఆర్టీఈ కింద 10 సీట్లకు లాటరీ తీస్తారు. కేటగిరీ రిజర్వేషన్కు అనుగుణంగా దివ్యాంగ విద్యార్థుల ఎంపికకు రెండో లాటరీ తీస్తారు. మూడో లాటరీలో ఆర్టీఈ, దివ్యాంగ విద్యార్థుల సీట్లు పోను మిగిలిన సీట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలను ఫిలప్ చేస్తారు. అడ్మిషన్ లాటరీకి స్కూల్ ప్రిన్సిపల్ కన్వీనర్గా ఓ టీచర్, ఇద్దరు తల్లిదండ్రులు, ఓ వీఎల్సీ మెంబర్ మొత్తం అయిదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తారు.
తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందాలంటే అడ్మిషన్ టెస్ట్ రాయాల్సిఉంటుంది. కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ చేసి అడ్మిషన్స్ కల్పిస్తారు. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. టెస్ట్ డ్యురేషన్ 3 గంటలు. కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తులు: 1వ తరగతిలో ప్రవేశాలకు స్టూడెంట్ బర్త్ సర్టిఫికెట్, ఫొటో, ఆధార్ వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన తరగతులకు సంబంధించి ఆయా కేంద్రియ విద్యాలయాలు సీట్ల ఖాళీల ప్రకటన విడుదల చేశాక ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1వ తరగతి అప్లికేషన్స్: ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19 వరకు
2 నుంచి 9 తరగతుల వరకు అప్లికేషన్స్: ఏప్రిల్ 8 నుంచి 15 వరకు
ఇంటర్ అప్లికేషన్స్: సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్ వచ్చిన 30 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి
వెబ్సైట్: kvsangathan.nic.in