
మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 84 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లు లెనిన్ వత్సల్ టొప్పొ, డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డఏ పీడీ పురుషోత్తమ్, సీపీవో సుబ్బారావు ఆఫీసర్లు పాల్గొన్నారు.