హనుమకొండలో అడ్వకేట్ల ధర్నా .. ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్

హనుమకొండలో అడ్వకేట్ల ధర్నా .. ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్

హనుమకొండ సిటీ, వెలుగు: అడ్వకేట్​పై దాడిచేసిన హనుమకొండ ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం అడ్వకేట్లు ధర్నా చేశారు. వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల పిలుపుమేరకు అదాలత్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు తీగల జీవన్​గౌడ్​ మాట్లాడుతూ వరంగల్ బార్ అసోసియేషన్ సభ్యుడైన అడ్వకేట్​ గంధం శివ పై ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి ఈనెల 3న రాత్రి కేయూసీ చౌరస్తా సమీపంలో దాడికి పాల్పడ్డాడని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రిసిప్ట్​ ఇచ్చి, కేసు నమోదు చేయలేదన్నారు. 

పీఎస్​లో దురుసుగా ప్రవర్తించి, కేసు పెట్టకపోవడంతో నిరసనకు దిగినట్లు చెప్పారు. సీఐపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల నాయకులు, అడ్వకేట్లు పాల్గొన్నారు.