బ్యాటరీ సెల్స్​ కోసం అమర రాజాతో ఎథర్​ జోడీ

బ్యాటరీ సెల్స్​ కోసం అమర రాజాతో ఎథర్​ జోడీ

న్యూఢిల్లీ: బ్యాటరీ సెల్‌‌‌‌‌‌‌‌ల అభివృద్ధి,  సరఫరా కోసం అమర రాజా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ సెల్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌తో కలసి పనిచేస్తామని ఎలక్ట్రిక్ టూవీలర్స్​ తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ గురువారం తెలిపింది. ఇందుకోసం  అమర రాజా ఎనర్జీ అండ్​ మొబిలిటీ పూర్తి అనుబంధ సంస్థ అయిన అమర రాజా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ సెల్ టెక్నాలజీస్ తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు తెలిపింది. 

 ఎంఓయూ ప్రకారం, అమర రాజా ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ (నికెల్ మాంగనీస్ కోబాల్ట్),  ఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్), లిథియం- అయాన్ (లీఅయాన్),  ఇతర అధునాతన కెమిస్ట్రీ సెల్స్​ను అభివృద్ధి చేయడానికి,  సరఫరా చేయడానికి ఎథర్‌‌‌‌‌‌‌‌తో కలసి పనిచేస్తుందని ఎథర్ ఎనర్జీ కో–-ఫౌండర్, సీఈఓ తరుణ్ మెహతా చెప్పారు. ఈ ఒప్పందం వల్ల తమ ఖర్చులు తగ్గుతాయని చెప్పారు