
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్సీఐ డిపోలు, కార్యాలయాల్లో 113 మేనేజ్మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల కోసం ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది. జనరల్, డిపో, మూవ్మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఖాళీలు: నార్త్ జోన్లో 38, సౌత్ జోన్లో 16, వెస్ట్ జోన్లో 20, ఈస్ట్ జోన్లో 21, నార్త్-ఈస్ట్ జోన్లో 18 పోస్టులు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్, సీఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఐసీఏఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
సెలెక్షన్: ఆన్లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ, ట్రెయినింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.40,000 – రూ.1,40,000 జీతం అందజేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ. 800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.recruitmentfci.in సంప్రదించాలి.
ఆర్మీలో మెడికల్ ఆఫీసర్స్
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ 420 మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 18 లోపు దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 27 నుంచి ఆర్మీ హాస్పిటల్ (ఆర్ & ఆర్), ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ప్రారంభమవుతాయి. వివరాలకు వెబ్సైట్www.amcsscentry.org లో సంప్రదించాలి.
మేనేజ్లో పీజీ డిప్లొమా
రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్) 2023–-2025 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సులో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది. కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజినీరింగ్, సైన్సెస్, కామర్స్). ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించే క్యాట్- 2022 స్కోరు కలిగి ఉండాలి. క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.manage.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.