15 నెలల తర్వాత సింగరేణి స్ట్రక్చర్డ్​ మీటింగ్​

15 నెలల తర్వాత సింగరేణి స్ట్రక్చర్డ్​ మీటింగ్​
  • ఈనెల- 7న స్ట్రక్చర్డ్​, 8న జేసీసీ సమావేశాలు  
  • కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫోకస్ 

గోదావరిఖని/ కోల్ బెల్ట్, వెలుగు:  సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫోకస్​చేసింది. ఇందుకు సంస్థ సీఎండీతో ఈనెల7న హైదరాబా ద్​సింగరేణి భవన్​లో స్ట్రక్చర్డ్​ మీటింగ్​లో భేటీ కానుంది. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత15 నెలలకు స్ట్రక్చర్డ్​మీటింగ్​నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే శనివారం గుర్తింపు (ఏఐటీయూసీ), ప్రాతినిధ్య(ఐఎన్​టీయూసీ) సంఘాలతో కలిపి జాయింట్​కన్సల్టెంట్​ కమిటీ (జేసీసీ) మీటింగ్​ను నిర్వహించేందుకు మేనేజ్​మెంట్​ఏర్పాట్లు చేస్తుంది. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ 2023 డిసెంబర్​27న జరిగిన ఎన్నికల్లో గెలిచింది. 2024 సెప్టెంబర్​9న గుర్తింపు హోదా పత్రం అందజేశారు. 

పెర్క్స్ అలవెన్సులు కార్మికులకు వర్తింపజేసేందుకు..

 తొమ్మిదేండ్లుగా కోలిండియాలో ఉద్యోగులకు పెర్క్స్​(అలవెన్సుల)పై పన్ను రీయింబర్స్​మెంట్ విధానం అమలవుతుంది. దీని వల్ల ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఆర్థికంగా లాభం కలుగుతుంది.  కోలిండియాలో అమలయ్యే ప్రతి అంశం సింగరేణితో ముడిపడి ఉంటుంది. అక్కడ అమలైతే ఇక్కడ కూడా అమలు చేయాల్సిందే.  సింగరేణిలో ఈ విధానాన్ని ఆఫీసర్లకు మేనేజ్​మెంట్​వర్తింపజేస్తు న్నప్పటికీ కార్మికులను మాత్రం విస్మరిస్తోంది.

ఈ అంశాన్ని పరిష్కరించాలని గుర్తింపు సంఘం డిమాండ్ చేస్తోంది.  అదేవిధంగా కోల్​ఇండియాలో 'ఓన్​ హౌస్​అండ్​లోన్​స్కీమ్​' ను250 గజాల భూమి కేటాయింపుతో పాటు రూ.30 లక్షలను హౌస్​ బిల్డింగ్​అడ్వాన్స్​(హెచ్​బీఏ) కింద 1974 నుంచి ప్రతి కార్మికుడికి కేటాయిస్తున్నారు. సింగరేణిలో మాత్రం అమలు చేయడం లేదు.  ప్రస్తుతం కార్మికులు, కుటుంబాల సౌకర్యం కోసం హైదరాబాద్​లో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​నిర్మించాలి.

లేకుంటే అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేలా సింగరేణి సంస్థ హెల్త్​ కార్డులను అందించాలి.  అన్ని గనుల ఆవరణలో రెస్ట్​ షెల్టర్లను నిర్మించాలి. కార్మికులు తమ సామగ్రి భద్రపరుచుకునేందుకు లాకర్ల సౌకర్యాన్ని కల్పించాలి. కొన్నేళ్లుగా హోదాలను మార్చకపోతుండగా కార్మికుల్లో ఆత్మన్యూనత నెలకొంది. ఇలాంటి అంశాలపై సింగరేణి సీఎండీ లెవల్​లో జరగ